Revanth Reddy: రెడ్డి సమరభేరికి రేవంత్ రెడ్డికి ఆహ్వానం

  • రెడ్డి సమస్యలపై రెడ్డి సమరభేరి
  • రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన రెడ్డి జేఏసీ
  • టీటీడి సభ్యుడు పెద్దిరెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన జేఏసీ

మే 27న హైదరాబాదులో జరగనున్న రెడ్డి సమరభేరికి కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని జేఏసీ నేతలు ఆహ్వానించారు. ఈ సందర్భంగా రెడ్డి సమస్యలపై జేఏసీ చేస్తున్న పోరాటాన్ని రేవంత్ కు వివరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ ఛైర్మన్ నవల్గా సత్యనారాయణరెడ్డి, అసోసియేట్ ఛైర్మన్ అప్పమాగారి రాంరెడ్డి, కోఛైర్మన్ పైళ్ల హరినాథరెడ్డి, కోచైర్మన్ పైళ్ల హరినాథరెడ్డి, ఐటీ, సోషల్ మీడియా ఛైర్మన్ తిరుమల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం టీటీడీ బోర్డు సభ్యుడిగా ఎంపికైన పెద్దిరెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. 

More Telugu News