Telangana: మరో భారీ ఎన్ కౌంటర్... గ్రేహౌండ్స్ దళాల చేతిలో ఆరుగురు మావోల మృతి

  • మళ్లీ రక్తమోడిన సరిహద్దులు
  • మావోల గురించి తెలుసుకుని గ్రేహౌండ్స్ మెరుపుదాడి
  • కొనసాగుతున్న ఎన్ కౌంటర్

తెలంగాణ - ఛత్తీస్ గఢ్ సరిహద్దులు మరోసారి రక్తమోడాయి. మావోయిస్టులు సమావేశం అవుతున్నారన్న విశ్వసనీయ సమాచారాన్ని తెలుసుకున్న గ్రేహౌండ్స్ దళాలు మెరుపుదాడి చేశాయి. అన్నారం - మర్రిమర్ల అడవుల పరిధిలో భారీ ఎన్ కౌంటర్ జరుగగా, ఆరుగురు మావోలు మరణించారు.

 గ్రేహౌండ్స్ దళాళను చూసిన మావోలు తొలుత కాల్పులు ప్రారంభించగా, ఎన్ కౌంటర్ మొదలైనట్టు ప్రాథమిక సమాచారం. ఎన్ కౌంటర్ ఇంకా కొనసాగుతుండగా, ఆ ప్రాంతానికి మరిన్ని బలగాలను పంపించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సివుంది. కాగా, ఇటీవల జరిగిన వరుస ఎన్ కౌంటర్లలో 39 మంది మావోలు మరణించిన సంగతి తెలిసిందే. 

More Telugu News