governor narasimhan: గవర్నర్ పోస్ట్ అందుకు తప్ప ఎందుకూ పనికిరాదు !: మంత్రి నక్కా ఆనంద్ బాబు

  • గవర్నర్ పోస్ట్ దండగ!
  • మంత్రి వర్గ ప్రమాణ స్వీకారానికి తప్ప ఎందుకూ పనికిరాదు!
  • సీఎం, గవర్నర్ భేటీలో నరసింహన్ నిజస్వరూపం బయటపడింది
  • అందుకే, గవర్నర్ పై చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గమర్నర్ నరసింహన్ పై ఏపీ మంత్రి నక్కా ఆనంద్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘గవర్నర్ పోస్ట్ దండగ. మంత్రి వర్గ ప్రమాణ స్వీకారానికి తప్ప ఎందుకూ ఆ పదవి పనికిరాదు. బడ్జెట్ లో గవర్నర్ కు కేటాయించిన నిధులు మొత్తం గుళ్లూగోపురాలు తిరిగేందుకు సరిపోయాయి. గవర్నర్ నరసింహన్ యాక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నారు. గతంలో రామ్ లాల్ ఉన్నప్పుడే గవర్నర్ వ్యవస్థను మేము వ్యతిరేకించాం.

అసలు మోదీ ప్రభుత్వానికి సిగ్గు లేదు. సంవత్సరాల తరబడి ఒకే గవర్నర్ ఎక్కడైనా ఉంటారా? పదకొండేళ్లుగా ఒకే గవర్నర్ ను కొనసాగిస్తున్నారు. కేంద్రం చేస్తున్న కుట్రకు గవర్నర్ అనుసంధాన కర్తగా ఉన్నారు. గవర్నర్ పదవికి మచ్చ తెచ్చారు. సీఎం, గవర్నర్ భేటీలో నరసింహన్ నిజస్వరూపం బయటపడింది. అందుకే, గవర్నర్ పై చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. తమపై కుట్రలు జరుగుతున్నాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపిస్తూ గతంలో గవర్నర్ ను కలిశారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్ మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ మమ్మల్ని తిట్టడానికే పెట్టారు. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై ఇంటెలిజెన్స్ నిఘా పెట్టాలి’ అని అన్నారు.

More Telugu News