pruthvi: నన్ను చూస్తే ఎవరూ కమెడియన్ అనుకోరు .. తిరుపతి థియేటర్లో అలా జరిగింది: పృథ్వీ

  • 'శ్రీ ఆంజనేయం'లో చేశాను 
  • నన్ను చూసి బంధువుల పిల్లలు భయపడేవారు 
  • ఓ కుర్రాడు తెగ ఏడ్చేశాడు      

తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో కమెడియన్ పృథ్వీ మాట్లాడుతూ ఓ తమాషా సంఘటనను గురించి ఇలా చెప్పుకొచ్చారు. " నేను మొదటి నుంచి అందరికీ ఒకే విషయం చెబుతుంటా .. నేను కమెడియన్ ను కాదు. నా పర్సనాలిటీని .. ఫిజిక్ ను చూసిన వాళ్లెవరూ నేను కమెడియన్ అనుకోరు. 'శ్రీ ఆంజనేయం' తరువాత మా బంధువుల పిల్లలు కూడా నన్ను చూసి  భయపడేవాళ్లు" అన్నారు.

"తిరుపతిలో రిలీజ్ రోజున 'శ్రీఆంజనేయం' సినిమా చూస్తున్నాను. నా ముందు వరుసలో ఒక ఫ్యామిలీ కూర్చుని వుంది .. వాళ్లకు ఓ చిన్నపిల్లాడు వున్నాడు. ముందుగా నన్ను చూసి నవ్విన ఆ కుర్రాడు .. సినిమాలో నా పాత్ర ఎంటర్ కాగానే కెవ్వుమంటూ ఏడవడం మొదలెట్టాడు. 'ఏమనుకోకండీ, మీరు కాసేపు బయటకి వెళ్లండి అని ఆ ఫ్యామిలీ అంటే, బయటే  నిలబడి సినిమా చూస్తూ ఎంజాయ్ చేశాను. సినిమా చూశాక 'చాలా బాగా చేశారంటూ' చెప్పి, ఆ ఫ్యామిలీ వెళ్లిపోయింది" అంటూ చెప్పుకొచ్చారు.        

More Telugu News