redmi note 5: నేటి అర్ధరాత్రి నుంచి 24 గంటల పాటు రెడ్ మీ నోట్ 5 విక్రయాలు?

  • ఇప్పటి వరకూ వారానికోసారి ఫ్లాష్ సేల్
  • ఒక రోజు పాటు నాన్ స్టాప్ విక్రయాలు చేపట్టనుందని సమాచారం
  • రెండు వెర్షన్లలో లభిస్తున్న ఫోన్

షియోమీ కంపెనీ నేటి అర్ధరాత్రి 12 గంటల నుంచి రెడ్ మీ నోట్ 5 విక్రయాలను ప్రారంభించనుందని మార్కెట్ వర్గాల సమాచారం. సాధారణంగా ఈ ఫోన్ ను సంస్థ ప్రతీ వారం ఫ్లాష్ సేల్ ద్వారా విక్రయిస్తోంది. అది కూడా మధ్యాహ్నం 12 గంటలకు మొదలై నిమిషాల్లోనే ముగిసిపోతోంది. దీంతో ఈ ఫోన్ కోరుకునే వారి కోసం షియోమీ ఎంఐ వెబ్ సైట్ ద్వారా ఒక రోజు పాటు విక్రయాలు చేపట్టనుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రెడ్ మీ నోట్ 5ను కంపెనీ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజీ వెర్షన్ ధర రూ.9,999. 4జీబీ ర్యామ్, 64జీబీ ర్యామ్ ధర రూ.11,999. ఈ ఫోన్ 18:9 డిస్ ప్లే తో ఉంటుంది.

More Telugu News