suddaramaiah: సిద్ధరామయ్యకు పోటీగా బరిలోకి దిగిన గాలి ప్రధాన అనుచరుడు

  • బాదామి నియోజకర్గంలో సిద్దూ వర్సెస్ బి.శ్రీరాములు
  • నేటితో ముగిసిన నామినేషన్ల ఘట్టం 
  • వేడెక్కిన కర్ణాటక ఎన్నికల చిత్రం

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు రోజులు దగ్గరపడుతున్న కొద్దీ వాతావరణం ఉత్కంఠభరితంగా మారుతోంది. ఈ రోజు నామినేషన్లకు తుది గడువు కావడంతో... అన్ని పార్టీల నేతలు తమ నామినేషన్లను దాఖలు చేసే కార్యక్రమాన్ని ముగించారు. ఈ క్రమంలో బాదామి నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు పోటీగా గాలి జనార్దన్ రెడ్డి ముఖ్య అనుచరుడు, నమ్మినబంటు అయిన బి.శ్రీరాములు బీజేపీ తరపున నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి యెడ్యూరప్ప, కేంద్ర మంత్రి జవదేకర్, బీజేపీ రాష్ట్ర ఇన్ ఛార్జ్ మురళీధరరావు తదితరులు శ్రీరాములు వెంట ఉన్నారు. సిద్దూ, శ్రీరాములు మధ్య పోటీ రసవత్తరంగా ఉండవచ్చని ప్రజలు అంటున్నారు.

  • Loading...

More Telugu News