sudheer babu: షూటింగ్ పూర్తిచేసుకున్న 'సమ్మోహనం'

  • సుధీర్ బాబు హీరోగా 'సమ్మోహనం'
  • కథానాయికగా అదితీరావు 
  • జూన్ 15వ తేదీన విడుదల 

మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా 'సమ్మోహనం' రూపొందుతోంది. శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా అదితీరావు నటిస్తోంది. తాజాగా ఈ సినిమాను గురించి నిర్మాత మాట్లాడుతూ .. " ముందుగా అనుకున్న ప్రకారం చిత్రీకరణ చేస్తూ తాజాగా ఈ సినిమా షూటింగును పూర్తి చేశాం"

"పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా మొదలుపెట్టాం. అత్యుత్తమ సాంకేతిక నైపుణ్యతో ఈ సినిమాను రూపొందించాం. ఎక్కడా ఏ విషయంలోను రాజీపడలేదు. మాటలు .. పాటలు .. చిత్రీకరణ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయనే నమ్మకం వుంది. రొమాన్స్ .. హాస్యం కలగలిసిన ఈ కథను దర్శకుడు అద్భుతంగా ఆవిష్కరించాడు. జూన్ 15వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నాం'' అని చెప్పుకొచ్చారు. 

More Telugu News