akhilapriya: ఈ రోజు రాలేనన్న అఖిలప్రియ... చంద్రబాబుతో భేటీ రేపటికి వాయిదా!

  • ఈరోజు శోభానాగిరెడ్డి వర్ధంతి
  • రేపు మధ్యాహ్నం సీఎంతో భేటీ  
  • సైకిల్ ర్యాలీ సందర్భంగా ఏవీపై రాళ్లదాడి

ముఖ్యమంత్రి చంద్రబాబుతో భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డిల సమావేశం రేపటికి వాయిదా పడింది. ఈ రోజు తన తల్లి శోభానాగిరెడ్డి వర్ధంతి సందర్భంగా తాను భేటీకి హాజరు కాలేనని అఖిలప్రియ సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో, సీఎంతో వీరిద్దరి భేటీ రేపు మధ్యాహ్నానికి వాయిదా పడింది. ఆళ్లగడ్డ నియోజకవర్గంతో టీడీపీ సైకిల్ ర్యాలీ సందర్భంగా ఏవీ సుబ్బారెడ్డిపై రాళ్ల దాడి జరిగిన సంగతి తెలిసిందే.

 ఈ దాడికి పాల్పడింది అఖిలప్రియ అనుచరులే అని సుబ్బారెడ్డి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో, కొంతమందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. సంయమనం పాటించాలని తాను చెప్పినా, మళ్లీ గొడవపడుతున్న ఈ ఇద్దరిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను కలవాలంటూ ఇద్దరికీ ఆదేశాలు జారీ చేశారు. అయితే, శోభ వర్ధంతి నేపథ్యంలో ఈ భేటీ వాయిదా పడింది.

More Telugu News