suman ranganath: అయిదు భాషల్లో విడుదల కానున్న 'దండుపాళ్యం 4'

  • షూటింగు దశలో 'దండుపాళ్యం 4'
  • ప్రధానమైన పాత్రలో సుమన్ రంగనాథ్ 
  • ఉత్కంఠను రేకెత్తించే సన్నివేశాలు

'దండుపాళ్యం' సినిమా మొదటి నుంచి కూడా ఒక వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే వస్తోంది. దాంతో ఈ సినిమా పార్టు 2 .. పార్టు 3 గా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం పార్టు 4కి సంబంధించిన షూటింగు కొనసాగుతోంది. మండే ఎండలను సైతం లెక్క చేయక చిత్రీకరణ జరుపుతున్నారు.

ఈ సినిమాలో సుమన్ రంగనాథ్ ప్రధానమైన పాత్రను పోషిస్తోంది. 'దండు' నాయకురాలిగా ఆమె ఈ సినిమాలో కనిపించనుంది. జైల్లో వున్న దండును తప్పించడానికి ఆమె ఏం చేసింది? ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేసింది? అనే ఉత్కంఠతో ఈ సినిమా కొనసాగనుంది. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ షూటింగు జరుపుకుంది. తెలుగుతో పాటు తమిళ .. కన్నడ .. మలయాళ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.    

More Telugu News