Allu Arjun: చాలా తప్పు.. ఆ మాటని టీవీల్లో లక్షల మందికి చూపించారు: మండిపడ్డ అల్లు అర్జున్

  • ఈ రోజు పవన్ కల్యాణ్‌ గురించి మాట్లాడి వెళతాను
  • కెరీర్ అయిపోతోన్న సమయంలో కొందరు రాజకీయాల్లోకి వస్తారు
  • పవన్ కల్యాణ్ అలా కాదు 
  • టీవీల్లోకి ఎవడెవడో వచ్చి ఏదేదో మాట్లాడుతున్నాడు

మెగా హీరోలంతా ఒకటేనని సినీనటుడు అల్లు అర్జున్‌ అన్నారు. ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం మండలానికి చెందిన మిలట్రీ మాధవరం గ్రామంలో 'నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా' సినిమా ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌ జరిగింది. ఈ సందర్భంగా బన్నీ మాట్లాడుతూ... "ఈ రోజు పవన్ కల్యాణ్‌ గురించి మాట్లాడి వెళతాను.. నాకు ఏదైనా విషయం గురించి మాట్లాడాలంటే.. నాకు బాగా మాట్లాడాలని అనిపించాలి. ఆయన నెంబర్‌ 1 హీరో... ఏసీ రూమ్‌లలో కూర్చొని హాయిగా బతకొచ్చు. అన్నింటినీ వదిలేసి జనంలోకి ఎండలోకి వచ్చారు.

ఏదో కెరీర్ అయిపోతోన్న సమయంలో కొందరు రాజకీయాల్లోకి వస్తారు. పవన్ కల్యాణ్ అలాకాదు.. నెంబర్‌ 1 స్థానంలో ఉన్నప్పుడు దాన్ని వదిలేసుకుని వచ్చారు. కొందరు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. అప్పట్లో చిరంజీవిపై కూడా విమర్శలు వచ్చాయి. టీవీల్లోకి ఎవడెవడో వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు. కానీ, మొన్న చాలా పర్సనల్‌గా మాట్లాడారు.. చాలా చాలా చాలా తప్పు.. మాట్లాడినోళ్లది తప్పు, మాట్లాడించినోళ్లది తప్పు, ఈ మాట లక్షల మందికి చూపించారు వాళ్లది పెద్ద తప్పు.. ఆ విషయం నాకు నచ్చలేదు" అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.  

More Telugu News