Bharath Ane Nenu: మహేశ్‌బాబు సినిమాపై జూ.ఎన్టీఆర్‌ ప్రశంసల జల్లు

  • సామాజిక బాధ్యతను కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో కలిపి సినిమా తీశారు
  • ఇలా తీయడం అంత తేలికైన విషయం కాదు
  • కొరటాల శివ ఈ రెండు అంశాలను చక్కగా బ్యాలెన్స్‌ చేశాడు
  • మహేశ్‌ బాబుకి శుభాకాంక్షలు

టాలీవుడ్ అగ్రనటుల్లో ఒకరైన మహేశ్‌ బాబు నటించిన 'భరత్‌ అనే నేను' సినిమాకు మంచి స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మహేశ్‌ బాబు.. ముఖ్యమంత్రి పాత్రలో నటించి మెప్పించారు. ఈ సినిమాపై సినీ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్‌ ఈ సినిమాపై స్పందిస్తూ ట్వీట్ చేశాడు.

సామాజిక బాధ్యతను కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో కలిపి సినిమా తీయడం అంత తేలికైన విషయం కాదని, దర్శకుడు కొరటాల శివ ఈ రెండు అంశాలను చాలా చక్కగా బ్యాలెన్స్‌ చేశాడని తారక్‌ పేర్కొన్నాడు. ఈ సినిమాలో అద్భుతంగా నటించిన మహేశ్‌ బాబుకి శుభాకాంక్షలు చెబుతున్నానని అన్నాడు. ఎప్పటికీ చెప్పుకోదగ్గ మంచి సినిమా తీసినందుకు 'భరత్‌ అనే నేను' సినీ బృందానికి కూడా శుభాకాంక్షలు చెబుతున్నానని తారక్‌ ట్వీట్లు చేశాడు.      

More Telugu News