Maharashtra: నక్సల్స్‌ కోసం సీఆర్పీఎఫ్‌ భారీ కూంబింగ్‌ ఆపరేషన్‌.. 13 మంది మావోయిస్టుల మృతి!

  • ఛత్తీస్‌గఢ్-మహారాష్ట్ర సరిహద్దులో ఎదురు కాల్పులు
  • నిన్న సీఆర్పీఎఫ్‌ ఏఎస్సై ని కాల్చి చంపిన మావోయిస్టులు
  • కొనసాగుతోన్న ఆపరేషన్

ఛత్తీస్‌గఢ్-మహారాష్ట్ర సరిహద్దులో నక్సల్స్‌ కోసం సీఆర్పీఎఫ్‌ భారీ కూంబింగ్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తోంది. ఈ ఆపరేషన్‌ ప్రారంభమైన వెంటనే బలగాల కాల్పుల్లో 13 మంది మావోయిస్టులు మృతి చెందారు. గడ్చిరోలి జిల్లా బోరియా అటవీప్రాంతంలోని ఏటపల్లి వద్ద నుంచి సీఆర్పీఎఫ్‌, కోబ్రా బలగాలు అడవిలో ఈ భారీ ఆపరేషన్‌ నిర్వహిస్తున్నట్లు సంబంధిత అధికారులు చెప్పారు.

నిన్న ఛత్తీస్‌గఢ్‌ లోని సుక్మా జిల్లాలో సీఆర్పీఎఫ్‌ ఏఎస్సైని నక్సల్స్ కాల్చి చంపిన నేపథ్యంలో ఈ ఆపరేషన్‌ నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతూనే ఉంది. అటవీ ప్రాంతంలో భారీగా ఎదురు కాల్పులు జరుగుతున్నట్లు సమాచారం.    

More Telugu News