Chandrababu: చంద్ర‌బాబు గారు.. మీరు పెద్ద‌నోట్ల ర‌ద్దు ప‌రిష్కార క‌మిటీ అధ్య‌క్షుడిగా ఉన్న విష‌యం మ‌ర్చిపోయారా?: ర‌ఘువీరారెడ్డి

  • ఈనెల 21న రాష్ట్ర వ్యాప్తంగా  అన్ని బ్యాంకులు, ఏటీఎంల వద్ద నిర‌స‌న
  • న‌గ‌దు కొర‌తతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు
  • ప్ర‌జాస‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కరించేందుకు చంద్ర‌బాబు ప్ర‌య‌త్నించాలి

దేశ వ్యాప్తంగా బ్యాంకులలోను, ఏటీఎంల వ‌ద్ద తీవ్ర‌మైన న‌గ‌దు కొర‌త ఉంద‌ని, ఏపీలో న‌గ‌దు కొర‌త‌ వల్ల ప్ర‌జ‌లు ప‌డుతున్న ఇబ్బందుల‌పై ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ కమిటీ ఈనెల 21న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బ్యాంకులు, ఏటీఎంల వద్ద నిర‌స‌న తెల‌పాల‌ని కాంగ్రెస్ నాయ‌కులకు, కార్య‌క‌ర్త‌లకు, అభిమానుల‌కు ఏపీసీసీ అధ్య‌క్షుడు డాక్ట‌ర్ ఎన్‌.ర‌ఘువీరారెడ్డి పిలుపునిచ్చారు.

ఈ సందర్బంగా ర‌ఘువీరారెడ్డి మాట్లాడుతూ.. ఏపీలో న‌గ‌దు కొర‌త తీవ్రంగా ఉంద‌ని, ఏటీఎంలలో డ‌బ్బులు లేక ప్ర‌జ‌లు ప‌డుతున్న ఇబ్బందులు సీఎం చంద్ర‌బాబుకు క‌నిసించ‌డం లేదా? అని ప్ర‌శ్నించారు. న‌గ‌దు కొర‌తతో ప్ర‌జ‌లు అవ‌స్థ‌లు ప‌డుతుంటే ప్ర‌భుత్వ ప‌రంగా తీసుకున్న చ‌ర్య‌లు ఏమిటి? అని డిమాండ్ చేశారు. పెద్ద‌నోట్లు ర‌ద్దును స్వాగ‌తించిన సీఎం చంద్ర‌బాబు ప‌రిష్కార క‌మిటీ అధ్య‌క్షుడిగా ఉన్న విష‌యం మ‌ర్చిపోయారా? అని ప్ర‌శ్నించారు. ప్ర‌జాస‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కరించేందుకు సీఎం చంద్ర‌బాబు ప్ర‌య‌త్నించాల‌ని ర‌ఘువీరారెడ్డి సూచించారు.

  • Loading...

More Telugu News