cash crunch: రూ.2,000 నోట్లను బయటకు రప్పించేందుకు ఐటీ శాఖ దాడులు

  • ఏపీ, కర్ణాటక వ్యాప్తంగా కొనసాగిన సోదాలు
  • 30-35 ప్రాంతాల్లో జరిగినట్టు అధికారిక సమాచారం
  • రూ.2,000 నోట్లను పెద్ద ఎత్తున దాచిపెట్టినట్టు వార్తలు

దేశవ్యాప్తంగా  చాలా రాష్ట్రాల్లో నగదుకు తీవ్ర కటకటలు ఏర్పడినట్టు వచ్చిన వార్తలతో ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులకు దిగారు. ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో 30-35 చోట్ల ఇవి కొనసాగాయి. నగదును పెద్ద ఎత్తున నిల్వ చేసుకోవడమే ఈ కొరతకు కారణమంటూ, మరీ ముఖ్యంగా రూ.2,000 నోట్లలో సగానికి పైగా వ్యవస్థలోకి తిరిగి రావడం లేదంటూ వార్తలు వచ్చాయి. దీంతో ఆదాయపన్ను శాఖ ఈ సోదాలు చేపట్టింది. ఇంత వరకు పెద్దగా ఏమీ పట్టుబడలేదు. మరోవైపు మరింత నగదును రాష్ట్రాలకు సరఫరా చేసేందుకు ఆర్ బీఐ చర్యలు మొదలు పెట్టింది. విమానాల ద్వారా తరలించే ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఏపీ, తెలంగాణలో నగదుకు తీవ్ర కటకటలు నెలకొన్నాయి.

  • Loading...

More Telugu News