sandhya: హాస్టల్‌ నుంచి ఇద్దరమ్మాయిలు వచ్చి జీవిత రాజశేఖర్‌ గురించి చెప్పారు.. ఆధారాలు రెడీ అవుతున్నాయి: సంధ్య

  • ఓ లెటర్‌ కూడా రాసుకొచ్చి నాకు ఇచ్చారు
  • వారిద్దరూ ఒక ప్రాంతంలో హాస్టల్‌లో ఉంటూ చదువుకున్నారు
  • అందులో ఒక అమ్మాయి పల్లెటూరి నుంచి వచ్చింది
  • సినీనటుడు రాజశేఖర్‌ని ఎవరి ద్వారానో కలిసింది

సామాజిక కార్యకర్త సంధ్యపై సినీనటి, ప్రొడ్యూసర్‌ జీవిత నిన్న మండిపడ్డ విషయం తెలిసిందే. సంధ్యను వదిలిపెట్టనని, నిరాధార ఆరోపణలు చేసిందని జీవిత అన్నారు. ఈ విషయంపై సంధ్య ప్రముఖ తెలుగు న్యూస్‌ ఛానెల్‌ టీవీ9కి తాజాగా ఇంటర్వ్యూ ఇచ్చి ఆధారాలు సిద్ధమవుతున్నాయని చెప్పారు. రాజశేఖర్‌ను పల్లెటూరు నుంచి వచ్చిన ఓ అమ్మాయి కలిసిన తీరుపై ఆమె స్పష్టంగా వివరించి చెప్పారు.

"నేను ప్రతి మంగళవారం, శుక్రవారం కౌన్సెలింగ్‌ ఇస్తాను. ఏడేళ్ల క్రితం ఇద్దరమ్మాయిలు నన్ను కలవడానికి వచ్చారు. ఓ లెటర్‌ కూడా రాసుకొచ్చి ఇచ్చారు. వారిద్దరూ ఒక ప్రాంతంలో హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నారు. అందులో ఒక అమ్మాయి పల్లెటూరి నుంచి వచ్చి, తన పాకెట్ మనీ కోసం ఎవరి ద్వారానో సినీనటుడు రాజశేఖర్‌ని కలిసింది. ఆమె ఒక కమిట్‌మెంట్‌లో ఉంది. అయితే, దానికి మధ్యలో డీల్‌ చేసేది జీవిత. అది క్యాస్టింగ్‌ కౌచ్ కాదు. డైరెక్టుగా డీలింగ్‌.. ఆ అమ్మాయిని సెక్సువల్‌గా వాడుకోవడమన్నమాట.

నాతో వారు ఇంకా చాలా చెప్పారు. వారిని మీడియా ముందుకు తీసుకురావడం నాకు ఇష్టం లేదు. మీకు బాగా తెలుసు, 30 ఏళ్లుగా నేను ఒక్కసారి కూడా బాధితులెవ్వరినీ మీడియా ముందుకు తీసుకురాలేదు. ఆ అమ్మాయిలిద్దరినీ తీసుకొచ్చి వారి భవిష్యత్తుని దెబ్బ తీయడం నాకు ఇష్టం లేదు. ఆ అమ్మాయిల్లో ఒక అమ్మాయి కజిన్ ఆంధ్రజ్యోతి ప్రెస్‌లో పని చేస్తారు. ఆయనతో చెబుతామని, పేపర్లో వేయిద్దామని ఆ అమ్మాయిలు అన్నారు. ఆంధ్రజ్యోతిలో వసంత లక్ష్మి అని ఒకావిడ ఉంటారు. ఆమెను కలవండని నేను చెప్పాను. రెండు, మూడు రోజుల్లోనే నవ్య పేజీలో ఆమె ఈ బాగోతమంతా పూర్తిగా ప్రచురించేలా చేశారు. అది ఇప్పుడు బయటకు తీసుకొచ్చి మళ్లీ చూపిస్తాం" అని సంధ్య తాను చేసిన ఆరోపణలను నిరూపించుకుంటానని స్పష్టంగా చెప్పారు.  

More Telugu News