Karnataka: కర్ణాటకలో భారీగా నకిలీ కరెన్సీ పట్టివేత

  • బెళగావిలో పోలీసుల తనిఖీలు
  • రూ.7 కోట్లు విలువ చేసే నకిలీ కరెన్సీ పోలీసుల స్వాధీనం  
  • ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

కర్ణాటకలో భారీగా నకిలీ కరెన్సీ పట్టుబడింది. బెళగావిలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా సుమారు రూ.7 కోట్ల విలువ చేసే రెండు వేల రూపాయల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకుని, ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటకలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఇలా నకిలీ కరెన్సీ పట్టుబడటం ప్రకంపనలు సృష్టిస్తోంది.

ఓటర్లను మభ్యపెట్టేందుకు రాజకీయపార్టీల నేతలు రంగంలోకి దిగుతున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. నిన్న ఓ ప్రైవేట్ బస్సులో వంద కోట్ల నగదును తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డ విషయం తెలిసిందే. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

More Telugu News