nagarjuna akkineni: అభిమానికి ధన్యవాదాలు చెప్పి.. ఆ సినిమా 'వెలుగు నీడలు' అన్న నాగార్జున

  • మహానటి’ టీజర్ ను ప్రశంసించిన నాగార్జున 
  • పాత సంఘటనను గుర్తు చేసిన అభిమాని 
  • సోషల్ మీడియాలో ఫొటో వైరల్

‘మహానటి’ సినిమా టీజర్ ను ప్రశంసిస్తూ ప్రముఖ నటుడు నాగార్జున ట్విట్టర్ లో ఒక పోస్టు పెట్టారు. దీంతో మరో నెటిజన్ 'నాగార్జున గారూ! మీరు సావిత్రిగారితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు గుర్తుందా?' అంటూ సావిత్రి ఒక బాబును ఎత్తుకున్న ఫొటోను పోస్టు చేశాడు. దానిని రిట్వీట్ చేస్తూ.. దానిని ‘గుర్తు చేసినందుకు థ్యాంక్స్ గౌతమ్, ఈ ఫొటో వెలుగు నీడలు సినిమాలోనిది’ అంటూ నాగార్జున పాత జ్ఞాపకాన్ని గుర్తుచేసుకున్నాడు.

దీంతో ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా, 'మహానటి' సినిమా మార్చి 29న విడుదల కావాల్సి ఉండగా, దానిని వాయిదా వేశారు. మే నెలలో విడుదల చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో టైటిల్ రోల్ ను కీర్తి సురేష్ పోషించగా, ఇతర పాత్రల్లో సమంత, విజయ్ దేవరకొండ, షాలినీ పాండే, దుల్కర్ సల్మాన్ తదితరులు నటించారు. ఈ సినిమా టీజర్ కి మంచి స్పందన వస్తోంది.

  • Loading...

More Telugu News