bellamkonda srinivas: టీజర్ రెడీ చేస్తోన్న 'సాక్ష్యం' .. అంచనాలు పెరగడం ఖాయమట!

  • శ్రీవాస్ దర్శకత్వంలో 'సాక్ష్యం'
  •  రేపే టీజర్ రిలీజ్
  • జూన్ 14న విడుదల        

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో 'సాక్ష్యం' సినిమా రూపొందుతోంది. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా సిద్ధమవుతోంది. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన కథానాయికగా పూజా హెగ్డే  నటిస్తుండగా, శరత్ కుమార్ .. జగపతిబాబు కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. పంచభూతాలను ఆధారంగా చేసుకుని ఈ కథ కొనసాగుతుందట. విభిన్నమైన ఈ కంటెంట్ ను ఇంతవరకూ ఎవరూ టచ్ చేయలేదని అంటున్నారు.

 ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అమెరికాలో జరుగుతోంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా నుంచి రేపు టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ టీజర్ తోనే ఈ సినిమాపై అంచనాలు పెరగడం ఖాయమనే నమ్మకంతో వున్నారు. జూన్ 14వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తారు.           

More Telugu News