kousalya: 'నీ కోసం' టైటిల్ సాంగ్ తో కెరియర్ మొదలైంది: సింగర్ కౌసల్య

  • ఫస్టు టైమ్ 'నీ కోసం' టైటిల్ సాంగ్ పాడాను 
  • ఆర్పీ పట్నాయక్ గారు ఛాన్స్ ఇచ్చారు 
  • 'చిత్రం'లో 'ఏకాంతవేళ ..' పాడాను

తెలుగులో సినిమా సింగర్ గా మంచి పేరు తెచ్చుకున్నవారి జాబితాలో కౌసల్య పేరు కూడా కనిపిస్తుంది. తన స్వర మాధుర్యంతో ఆమె ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. అలాంటి కౌసల్య .. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొని, తన కెరియర్ కి సంబంధించిన విషయాలను గురించి ప్రస్తావించారు.

" ఆర్పీ పట్నాయక్ గారు సంగీతాన్ని అందించిన 'నీ కోసం' టైటిల్ సాంగ్ తో సింగర్ గా నా కెరియర్ మొదలైంది. ఆర్పీ గారికి కూడా సంగీతదర్శకుడిగా అదే మొదటి సినిమా. వేణు .. నిహాల్ .. మణి నాగరాజ్ వంటి గాయనీ గాయకులు ఈ సినిమా ద్వారానే పరిచయమయ్యారు. ఈ సినిమా తరువాత 'చిత్రం' మూవీ కోసం 'ఏకాంతవేళ .. ' పాడాను" అన్నారు. ఇక ఇదే కార్యక్రమంలో ఆమె 'ఇడియట్' సినిమా కోసం పాడిన 'ఈ రోజే తెలిసింది .. ' అనే పాటను అలీ కోరిక మేరకు పాడారు.   

More Telugu News