masque: మక్కా మసీదు పేలుళ్ల కేసులో.. తీర్పు వెల్లడించిన ప్రధాన న్యాయమూర్తి రవీందర్‌ రెడ్డి రాజీనామా

  • నేరారోపణలు నిరూపణ కాకపోవడంతో కేసు కొట్టేసిన రవీందర్‌రెడ్డి
  • సంచలన తీర్పు వెల్లడించిన రోజే రాజీనామా 
  • చర్చనీయాంశంగా మారిన రాజీనామా

మక్కా మసీదు పేలుళ్ల కేసులో నిందితులపై ఉన్న నేరారోపణలు నిరూపణ కాని కారణంగా నాంపల్లిలోని స్పెషల్ ఎన్‌ఐఏ కోర్టు వారిని నిర్దోషులుగా ప్రకటించి, ఆ కేసుని కొట్టేసిన విషయం తెలిసిందే. ఈ సంచలన తీర్పునిచ్చిన ఎన్‌ఐఏ కోర్టు ప్రధాన న్యాయమూర్తి రవీందర్‌రెడ్డి రాజీనామా చేశారు. ఇందుకు సంబంధించి ఆయన కొద్ది సేపటి క్రితం హైకోర్టుకు తన రాజీనామా లేఖను సమర్పించారు. కాగా, ఆయన రాజీనామా చేయడానికి గల కారణాలపై వివరాలు తెలియాల్సి ఉంది. ఈ రోజు మధ్యాహ్నం సంచలన తీర్పు వెల్లడించి, సాయంకాలం రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.

More Telugu News