aicc: ఏఐసీసీ కార్యదర్శులుగా గిడుగు రుద్ర‌రాజు, షేక్ మ‌స్తాన్ వ‌లీ ఎంపిక‌

  • ఓ ప్రకటనలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ వెల్లడి
  • రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు నియామకం
  • రుద్ర‌రాజు, మ‌స్తాన్ వ‌లీని అభినందించిన ఏపీ కాంగ్రెస్

అఖిల భార‌త కాంగ్రెస్ పార్టీ (ఏఐసీసీ) కార్య‌ద‌ర్శులుగా మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు, మాజీ ఎమ్మెల్యే షేక్ మస్తాన్ వలిని నియమించారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఏఐసీసీ కార్యదర్శులుగా గిడుగు రుద్రరాజు, మస్తాన్ వలిని నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదేశాలు జారీ చేశారని, ఈ మేరకు వారి నియామకం జరిగినట్టు పేర్కొన్నారు. కాగా, ఏఐసీసీ కార్యదర్శులుగా ఎంపికైన గిడుగు రుద్రరాజు, షేక్ మస్తాన్ వలిలను ఏపీ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఎస్.ఎన్. రాజా అభినందించారు. ఈ పదవుల్లో వారిని నియమించడంపై హర్షం వ్యక్తం చేశారు.

More Telugu News