Ranga sthalam: త్వరలో రూ.200 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టనున్న ‘రంగస్థలం’

  • బాక్సాఫీసు రికార్డులతో దూసుకుపోతున్న ‘రంగస్థలం’
  • ప్రపంచ వ్యాప్తంగా రూ.175 కోట్ల గ్రాస్ వసూలు 
  • అమెరికాలో మూడో వారంలో మొత్తం 3,286,022 డాలర్ల వసూలు 

గత నెల 30న విడుదలైన ‘రంగస్థలం’ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.175 కోట్ల గ్రాస్ సాధించినట్టు ‘రంగస్థలం’ చిత్ర యూనిట్ పేర్కొంది. త్వరలోనే ఇది రూ.200 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టనుందని సినీ ట్రేడ్ వర్గాల అంచనా. తెలుగులో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాల జాబితాలో చేరిపోయిన 'రంగస్థలం’ అమెరికాలోనూ తన సత్తా చాటింది.

అమెరికాలో మూడో వారానికి మొత్తం 3,286,022 డాలర్లు వసూలు చేసినట్టు సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా, ‘రంగస్థలం’ విజయోత్సవ వేడుకను రెండు రోజుల క్రితం నిర్వహించారు. ఆస్కార్ కి నామినేట్ చేయాల్సినంత గొప్పచిత్రం ‘రంగస్థలం’ అని ప్రముఖ హీరో పవన్ కల్యాణ్ ఆ వేడుకలో అభిప్రాయపడ్డ విషయం తెలిసిందే.

More Telugu News