KTR: మంత్రి కేటీఆర్‌ ప్రసంగానికి అడ్డుతగిలిన యువకుడు!

  • రవీంద్రభారతిలో అంబేద్కర్ జయంతి వేడుకలు
  • హాజరైన కేటీఆర్, జగదీష్ రెడ్డి
  • అంబేద్కర్ కు పూలమాల ఎందుకు వేయలేదని ప్రశ్నించిన వ్యక్తి

తెలంగాణ మంత్రి కేటీఆర్ కు చేదు అనుభవం ఎదురైంది. రవీంద్రభారతిలో ఈరోజు జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకలకు కేటీఆర్, జగదీష్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడేందుకు లేవగా ఓ యువకుడు అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల ఎందుకు వేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

జ్యోతిరావు పూలేకు నివాళి అర్పించి, అంబేద్కర్ కు ఎందుకు అర్పించలేదని ప్రశ్నించాడు. దీంతో, సభలో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో ఆందోళన చేస్తున్న వ్యక్తితో మాట్లాడాలని ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పిడమర్తి రవిని కేటీఆర్ ఆదేశించారు. స్టేజిపై నుంచి కిందకు వచ్చిన రవి... ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన వ్యక్తిని బయటకు పంపించివేశాడు. 

  • Loading...

More Telugu News