ipl: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోహ్లీ

  • రాయల్‌ ఛాలెంజర్స్‌-కింగ్స్‌ ఎలెవన్‌ జట్ల మధ్య మ్యాచ్
  • ఈ సీజన్ లో తొలిసారి హోం గ్రౌండ్ లో ఆడుతున్న కోహ్లీ సేన
  • గెలవాలన్న పట్టుదలతో కోహ్లీ సేన
  • ఓటమిపాలు కాకూడదని అశ్విన్ సేన

ఐపీఎల్‌ సీజన్-11లో భాగంగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు-కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్ల మధ్య బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం వేదికగా లీగ్ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ సీజన్‌ లో తొలిసారి సొంతగడ్డపై ఆడుతున్న కోహ్లీ, టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్నాడు. తొలి మ్యాచ్ లో ఓటమిపాలైన కోహ్లీ ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉన్నాడు. తొలి మ్యాచ్ లో సాధించిన విజయోత్సాహంతో ఉన్న అశ్విన్ సేన ఈ మ్యాచ్ లో కూడా విజయం సాధించాలని ప్రణాళికలు రచించింది. 

More Telugu News