Narendra Modi: ఉత్తర భారతదేశానికి వెళ్లే రహదారులను మూసివేస్తాం: చలసాని శ్రీనివాస్ హెచ్చరిక

  • మోదీ తీరు మారకపోతే దక్షిణాదిలో తెలుగు వారిని కూడగడతాం
  • 16న తలపెట్టిన ఏపీ బంద్ కు అన్ని పార్టీలు కలిసి రావాలి
  • రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి
  • బంద్ రోజున జరగాల్సిన పరీక్షలు వాయిదా వేయాలి

ప్రధాని నరేంద్ర మోదీ తీరు మారకపోతే దక్షిణ భారతదేశంలోని తెలుగు ప్రజలందరినీ కూడగడతామని, ఉత్తర భారత దేశానికి వెళ్లే రహదారులను మూసివేస్తామని ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ హెచ్చరించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తల్లిదండ్రులను చంపేసి, సమాజమే తమకు అన్యాయం చేసిందన్నట్టుగా మోదీ వ్యవహారం ఉందని విమర్శించారు. ఈ నెల 16న తలపెట్టిన ఏపీ బంద్ కు అన్ని పార్టీలు కలిసి రావాలని, రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని, బంద్ రోజు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేయాలని కోరారు.

More Telugu News