Chandrababu: సింగపూర్ లో చంద్రబాబును కలిసిన సచిన్ టెండూల్కర్

  • సింగపూర్ లో ఉన్న సచిన్ టెండూల్కర్
  • చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసిన క్రికెట్ లెజెండ్
  • దత్తత తీసుకున్న గ్రామ అభివృద్ధిపై చర్చ

సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబును క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కలిశాడు. చంద్రబాబు సింగపూర్ వెళ్లిన సమయంలోనే సచిన్ కూడా అక్కడే ఉన్నాడు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలిశాడు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య కొన్ని అంశాలపై చర్చ జరిగింది. నెల్లూరు జిల్లాలోని ఓ గ్రామాన్ని సచిన్ ఇప్పటికే దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఆ గ్రామంలో ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ గ్రామ అభివృద్ధిపై కూడా ఇరువురి మధ్య చర్చ జరిగింది. మరోవైపు, సింగపూర్ లో చంద్రబాబు బిజీబిజీగా గడుపుతున్నారు.

More Telugu News