Ramehs Reddy: తాడిపత్రి వైసీపీ నేత రమేష్ రెడ్డిపై హత్యాయత్నం... దుండగుడిపై రమేష్ రెడ్డి కాల్పులు!

  • రమేష్ రెడ్డి ఇంట్లోనే ఘటన
  • ఆత్మ రక్షణార్థం కాల్చానంటున్న రమేష్
  • కేసును విచారిస్తున్న పోలీసులు

తుపాకి కాల్పులతో అనంతపురం జిల్లా తాడిపత్రి మరోసారి ఉలిక్కిపడింది. పట్టణంలోని వైసీపీ నేత రమేష్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. ఆయన ఇంట్లోనే ఈ ఘటన జరిగింది. బాలచందర్ అనే వ్యక్తి రమేష్ ఇంట్లోకి చొరబడి ఆయనపై హత్యాయత్నం చేయగా, ప్రాణాలను కాపాడుకునే క్రమంలో తన వద్ద ఉన్న లైసెన్స్డ్ రివాల్వర్ తో రమేష్ కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది.

ఈ ఘటనలో బాలచందర్ కాలికి గాయమైంది. తరువాత అతన్ని బంధించిన రమేష్ రెడ్డి, పోలీసులకు సమాచారాన్ని అందించగా, వారు వచ్చి రమేష్ రెడ్డిని విచారిస్తున్నారు. తమ నేతపై హత్యాయత్నం జరిగిందని తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు పెద్దఎత్తున రమేష్ రెడ్డి ఇంటి వద్దకు చేరారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి వుంది.

  • Loading...

More Telugu News