Andhra Pradesh: 16న ఏపీ మంత్రి మండలి సమావేశం

  • మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రారంభం
  • అమరావతిలోని సచివాలయంలో సమావేశం
  • ప్రభుత్వ కార్యదర్శులు ప్రతిపాదనలు పంపాలని సూచన

ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆంధ్రప్రదేశ్‌ మంత్రి మండలి సమావేశం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌ కుమార్ ఈ రోజు సాయంత్రం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. అమరావతిలోని తాత్కాలిక సచివాలయం ఒకటవ బ్లాక్‌ మొదటి అంతస్తులోని సమావేశ మందిరంలో ఈ సమావేశం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు తాము చేయాల్సిన ప్రతిపాదనలను సకాలంలో సాధారణ పరిపాలనా (కేబినెట్-1) విభాగానికి పంపాలని ఆయన కోరారు.

  • Loading...

More Telugu News