ajay ghosh: ఈ దర్శకుల నుంచి ఎంతో నేర్చుకున్నాను: నటుడు అజయ్ ఘోష్

  • 'రంగస్థలం'లోని పాత్ర సంతృప్తినిచ్చింది
  • గొప్ప దర్శకులతో కలిసి పని చేశాను 
  • వాళ్లంతా విశాలమైన మనసున్నవాళ్లు     

తాజాగా ఐ డ్రీమ్స్ తో నటుడు అజయ్ ఘోష్ మాట్లాడుతూ 'రంగస్థలం' నాకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఈ సినిమాలో పాత్ర .. నటుడిగా నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది. నా లైఫ్ లో ఇలా ఎప్పుడూ లేదు. అందరూ ఫోన్లు చేసి అభినందిస్తున్నారు .. అంత గొప్పగా చేశానా? అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చిన క్రేజ్ ను ఎలా నిలబెట్టుకోవాలా అనే టెన్షన్ నాకు లేదు.

 నా నటనను గుర్తించి సుకుమార్ గారు ఎలా అవకాశం ఇచ్చారో .. మిగతా వాళ్లూ అలాగే ఇస్తారని అనుకుంటున్నాను. 'జ్యోతిలక్ష్మి'తో పూరీ గారు విలన్ గా నాపై ఓ ముద్ర వేశారు .. ఆయన నాకు గాడ్ ఫాదర్ అనే చెప్పాలి. సుకుమార్ .. రాజమౌళి .. బాపు గారి వంటి దర్శకులతో కలిసి పనిచేశాను. వాళ్లంతా ఎంతో మేధావులు .. విశాలమైన మనసున్న వాళ్లు. వాళ్ల నుంచి నేను చాలా నేర్చుకున్నాను" అని చెప్పుకొచ్చారు.    

More Telugu News