srireddy: సినీ నటి శ్రీరెడ్డికి జరిగిన అవమానం గురించి తెలంగాణ ప్రభుత్వం ప్రకటన చేయాలి: మహిళా హక్కుల కార్యకర్తల డిమాండ్

  • మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ని కలిసిన మహిళా హక్కుల కార్యకర్తలు
  • మహిళలపై లైంగిక వేధింపులు, వారి సమస్యలపై ఒక కమిటీని ఏర్పాటు చేయాలి
  • లైంగిక వేధింపుల ఫిర్యాదు కోసం ప్రత్యేకంగా హెల్ప్ లైన్ లు ఏర్పాటు చేయాలి

తెలుగు చిత్ర పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు, వారు ఎదుర్కొంటున్న వివిధ అంశాలపై డిసెంబరు 2012 లో వేసిన వర్మ కమిషన్ మాదిరిగా తెలంగాణ ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ఈ రోజు వివిధ మహిళా హక్కుల కార్యకర్తలు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ని కలిసి విజ్ఞప్తి చేశారు.

మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపుల ఫిర్యాదు కోసం ప్రత్యేకంగా హెల్ప్ లైన్ లు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని కోరారు. అలాగే శ్రీరెడ్డికి జరిగిన అవమానం గురించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాగా, మహిళా హక్కుల కార్యకర్తలు మంత్రికి ఫిర్యాదు చేసిన దృశ్యాలకు సంబంధించిన ఫొటోలను సినీ నటి మాధవి తన ఫేస్ బుక్ ఖాతాలో షేర్ చేసింది. 

More Telugu News