vishnu kumar raju: బీజేపీకి గుడ్ బై చెప్పడంపై విష్ణుకుమార్ రాజు స్పందన

  • నాకు అలాంటి ఆలోచన లేదు
  • ఎన్నికలకు చాలా సమయం ఉంది
  • అంత దూరం ఆలోచించడం లేదు

ఏపీ అసెంబ్లీలో బీజేపీ పక్ష నేత విష్ణుకుమార్ రాజు ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై తాజాగా విష్ణు స్పందించారు. తనకు అలాంటి ఆలోచన లేదని చెప్పారు. పార్టీ ఆదేశిస్తే... మళ్లీ విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని తెలిపారు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందని... ఈ నేపథ్యంలో, తాను అంత దూరం ఆలోచన చేయడం లేదని చెప్పారు. మరోవైపు, జనసేనతో కానీ, వైసీపీతో కానీ బీజేపీ పొత్తు పెట్టుకునే అవకాశం ప్రస్తుతానికైతే లేదని అన్నారు. 

  • Loading...

More Telugu News