Andhra Pradesh: హోదా రావాలంటే ఇది చాలదు: రోశయ్య కీలక వ్యాఖ్యలు

  • ఈ ఉద్యమాలు, నిరసనలు చాలవు
  • మరింత ఉద్ధృత స్థాయికి తీసుకెళ్లాలి
  • అప్పుడే ఫలితం ఉంటుందన్న రోశయ్య

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాలంటే, ఇప్పుడు చేస్తున్న ఉద్యమాలు, తెలుపుతున్న నిరసనలు సరిపోవని మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య వ్యాఖ్యానించారు. విజయవాడ స్టేట్ గెస్ట్ హౌస్ లో ఉన్న రోశయ్యను కలిసేందుకు ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న వచ్చిన వేళ, రోశయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. తాము చేస్తున్న హోదా ఉద్యమానికి మద్దతివ్వాలని వెంకన్న కోరగా, హోదా ఉద్యమాన్ని ఎవరూ ఊహించనంత ఉద్ధృత స్థాయికి తీసుకు వెళితేనే ఫలితం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలకు నరేంద్ర మోదీ కట్టుబడి ఉండాలని హితవు పలికారు.

More Telugu News