lankan premier league: లంకన్ ప్రీమియర్ లీగ్ డైరెక్టర్ గా రసెల్ అర్నాల్డ్

  • ఆగస్టు మూడో వారం నుంచి లీగ్ ప్రారంభం
  • ఐదేళ్ల పాటు డైరెక్టర్ గా రసెల్ అర్నాల్డ్
  • ప్రస్తుతం సిడ్నీలో నివసిస్తున్న రసెల్

శ్రీలంక మాజీ క్రికెటర్ రసెల్ అర్నాల్డ్ ను గొప్ప పదవి వరించింది. లంకన్ ప్రీమియర్ లీగ్ డైరెక్టర్ గా రసెల్ ఎంపికయ్యాడు. ఈ ఏడాది ఆగస్టులో ఈ లీగ్ ప్రారంభం కానుంది. ప్రపంచ వ్యాప్తంగా ఐపీఎల్, సీపీఎల్, సీఎస్ఎల్, బీపీఎల్ వంటి టీ20 లీగ్ లు విజయవంతం కావడంతో... శ్రీలంక బోర్డు కూడా టీ20కి తెరలేపింది. ఆగస్టు మూడో వారం నుంచి సెప్టెంబర్ రెండో వారం వరకు ఈ టోర్నీ జరగనుంది. రానున్న ఐదేళ్ల వరకు ఈ లీగ్ కు రసెల్ డైరెక్టర్ గా వ్యవహరిస్తాడని శ్రీలంక క్రికెట్ బోర్డు తెలిపింది. రసెల్ అర్నాల్డ్ 2007లో అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. రిటైర్మెంట్ తర్వాత సిడ్నీలో ఆయన నివసిస్తున్నాడు.

More Telugu News