Mahesh Babu: మహేశ్ బాబు 25వ మూవీలో షాలినీ పాండే?

  • త్వరలో సెట్స్ పైకి మహేశ్ 25వ మూవీ
  • కథానాయికగా పూజా హెగ్డే 
  • ముఖ్యమైన పాత్రలో షాలినీ పాండే  

'అర్జున్ రెడ్డి' సినిమాతో షాలినీ పాండేకి విపరీతమైన క్రేజ్ వచ్చింది. దాంతో ఒక్కొక్కటిగా ఈ అమ్మాయి అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. ఈ క్రమంలోనే మహేశ్ బాబు 25వ సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని అంటున్నారు. ప్రస్తుతం 'భరత్ అనే నేను' సినిమాతో ఈ నెల 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి మహేశ్ బాబు రెడీ అవుతున్నాడు.

తన 25వ సినిమాను ఆయన వంశీ పైడిపల్లితో చేయనున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డేను ఎంపిక చేసుకున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను షాలినీ పాండేతో చేయిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో, ఆమెను ఎంపిక చేసినట్టుగా సమాచారం. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అనే ఆసక్తితో ఆమె ఉందని అంటున్నారు. దిల్ రాజు .. అశ్వనీదత్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే.    

More Telugu News