Jet Airways: ఢిల్లీ విమానాశ్రయంలో తప్పిన పెను ప్రమాదం.. కేటరింగ్ వ్యాన్‌ను ఢీకొట్టిన జెట్ ఎయిర్‌వేస్ విమానం

  • దుబాయ్ నుంచి ఢిల్లీ చేరుకున్న విమానం
  •  పార్కింగ్ ప్లేస్‌కు వెళ్తుండగా వాహనాన్ని ఢీకొన్న విమానం రెక్క
  • విమానంలో 125 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది

ఢిల్లీ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. దుబాయ్ నుంచి 133 మంది ప్రయాణికులతో ఢిల్లీలో ల్యాండైన జెట్ ఎయిర్‌వేస్ విమానం పార్కింగ్ చేసి ఉన్న కేటరింగ్ వ్యాన్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. విమానం పార్కింగ్ ప్లేస్‌లోకి వెళ్తుండగా దాని కుడి రెక్క పార్కింగ్ చేసి ఉన్న కేటరింగ్ వాహనానికి తగిలింది. విమానంలో ఉన్న 125 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బందిని సురక్షితంగా విమానం నుంచి దించినట్టు అధికారులు తెలిపారు. దెబ్బతిన్న విమానాన్ని ఎయిర్ లైన్స్ టెక్నికల్ సిబ్బంది పరీక్షిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించినట్టు జెట్ ఎయిర్‌వేస్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.

More Telugu News