bjp: ప్రధాని ఇంటిముందు టీడీపీ ఎంపీల నిరసన చౌకబారుగా ఉంది: బీజేపీ నేత హరిబాబు

  • ఏపీకి కేంద్రం అన్యాయం చేసిందనడం సబబు కాదు
  • ‘నేనే ఏపీ..ఏపీ అంటే నేనే’ అనేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు
  • చేసిన సాయం గురించి చెబుతుంటే దాడి చేస్తున్నామంటారా?  

ఏపీ ప్రయోజనాల కోసం టీడీపీ ఎంపీలు ప్రధాని ఇంటిముందు నిరసన వ్యక్తం చేయడం చౌకబారుగా ఉందని బీజేపీ నేత హరిబాబు విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో ప్రధాన పార్టీలేవీ పాల్గొనలేదని, ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు అన్యాయంగా ఉన్నాయని, కమిటీల ద్వారా ఉద్యమాన్ని నిర్వహిస్తారని, ఆ ఉద్యమానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తుందట అని ఎద్దేవా చేశారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆరోపించడం సబబు కాదని, ‘‘నేనే ఏపీ..ఏపీ అంటే నేనే’ అనేలా చంద్రబాబు వ్యవహరించడం విడ్డూరంగా ఉందని, ప్రభుత్వ ప్రాయోజిత ఉద్యమాల వల్ల ప్రజలకు ఇబ్బంది తప్పితే మరొకటి కాదని, కేంద్రం చేసిన సాయాన్ని చెబుతుంటే, దాడి చేస్తున్నారని చంద్రబాబు అంటున్నారని విమర్శించారు.

More Telugu News