Vijayawada: విజయవాడ కార్పొరేటర్ పేరుతో ఉద్యోగుల దందా!

  • కార్పొరేటర్ శ్రావణి పేరిట సిమ్ కార్డులు తీసుకున్న ఉద్యోగులు
  • ట్రూకాలర్ లో ఆమె పేరు, ఫొటోను సేవ్ చేసిన వైనం
  • కార్పొరేటర్ మాదిరిగా మాట్లాడేందుకు ఓ అమ్మాయి 
  • శ్రావణి ఫిర్యాదు మేరకు ఇద్దరు ఉద్యోగులపై కేసు నమోదు

విజయవాడ కార్పొరేటర్ శ్రావణి పేరుతో మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన ఇద్దరు ఉద్యోగులు దందాకు పాల్పడిన సంఘటన వెలుగుచూసింది. కార్పొరేటర్ శ్రావణి పేరిట సిమ్ కార్డులు తీసుకుని, ట్రూకాలర్ లో ఆమె పేరు, ఫొటోను వారు సేవ్ చేశారు. అంతేకాకుండా, అవతలి వ్యక్తులతో కార్పొరేటర్ మాదిరిగా మాట్లాడేందుకు ఓ అమ్మాయిని కూడా ఉద్యోగులు నియమించుకున్నారు. ఈ అమ్మాయితో ఫోన్ లో మాట్లాడించి సదరు ఉద్యోగులు వసూళ్లకు పాల్పడేవారు. ఈ ఇధ్దరు ఉద్యోగులకు తోడుగా మరో ఇద్దరు వ్యక్తులు కూడా తోడయ్యారు. ఈ విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయిన కార్పొరేటర్ శ్రావణి ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఇద్దరు ఉద్యోగులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

More Telugu News