Bharath Ane Nenu: ‘భరత్ అనే నేను’ వేడుకకు భారీగా హాజరైన అభిమానులు

  • హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ప్రీ రిలీజ్ వేడుక
  • మహేష్ బాబు అభిమానుల ఉత్సాహం
  • ముఖ్యఅతిథిగా హాజరుకానున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్

కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందిన ‘భరత్ అనే నేను’ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో మరి కొంచెం సేపట్లో ప్రారంభం కానుంది. ఈ వేడుకకు మహేష్ బాబు అభిమానులు ఇప్పటికే భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హాజరుకానున్నారు. మహేశ్ అభిమానులతో పాటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఇక్కడికి చేరుకున్నారు. కాగా, మహేశ్ బాబు చిత్ర పటాలను చేతబూనిన అభిమానులు తమ అభిమాన హీరోను చూసేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నారు. 

  • Loading...

More Telugu News