marriage: వడోదరలో సామూహిక వివాహ వేడుక.. పెళ్లి చేసుకున్న 542 జంటలు

  • మహేంద్ర జాసాభాయ్‌ ట్రస్టు ఆధ్వర్యంలో వివాహాలు
  • ముఖ్య అతిథిగా గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీ
  • కొత్త జంటలకు ఉచితంగా సామగ్రి

గుజరాత్‌లోని వడోదరలో మహేంద్ర జాసాభాయ్‌ ట్రస్టు ఆధ్వర్యంలో 542 జంటలు వివాహ బంధంతో ఒక్కటయ్యాయి. ఓ పండుగలా జరిపిన ఈ వేడుకలో ఆ రాష్ట్ర సీఎం విజయ్‌ రూపానీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అన్ని మతాల జంటలు ఇందులో ఉన్నాయి. ఈ సామూహిక వివాహాల కోసం వధూవరుల కుటుంబాలు ఎటువంటి ఖర్చూ చేయలేదు. అన్ని ఖర్చులను సదరు ట్రస్ట్ సిబ్బందే పెట్టుకోవడంతో పాటు కొత్త కాపురానికి కావాల్సిన సామగ్రిని కూడా జంటలకు అందించింది. ఈ జంటల్లో నలుగురు వికలాంగులు కూడా ఉన్నారని, వారికి తమ రాష్ట్ర సీఎం విజయ్‌రూపానీ రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారని ట్రస్టు నిర్వాహకులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను మీరూ చూడండి... 

More Telugu News