molest: రైల్లో మహిళపై లైంగిక దాడి.. సినిమా చూసినట్లు చూసిన తోటి ప్రయాణికులు!

  • ముంబయిలోని లోకల్ ప్యాసింజర్ రైలులో ఘటన
  • చివరకు తప్పించుకున్న మహిళ
  • వీడియోలు తీసిన తోటి ప్రయాణికులు

ముంబయిలోని లోకల్ ప్యాసింజర్ రైలులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఛత్రపతి శివాజీ టెర్మినస్‌కు బయల్దేరిన ఓ లోకల్ రైలు కల్యాణ్- దాదర్ రైల్వే స్టేషన్ల మధ్య ఉండగా ఓ మహిళపై ఓ మృగాడు లైంగిక దాడికి ప్రయత్నించాడు. చుట్టూ చాలా మంది ప్రయాణికులు ఉన్నప్పటికీ ఒక్కరూ ఆ దారుణాన్ని ప్రశ్నించడానికి ప్రయత్నించలేదు. అంతేగాక, ప్రయాణికుల్లో కొంత మంది ఈ దృశ్యాలను వీడియో తీశారు.

చివరకు ఓ ప్రయాణికుడు పోలీసులకు సమాచారం అందించడంతో తదుపరి స్టేషన్‌లో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి అతడిపై లైంగిక వేధింపులు, హత్యాయత్నం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడి పేరు రఫీక్ షేక్ గా గుర్తించిన పోలీసులు.. బాధిత మహిళకు ఆయన ముందే తెలుసని, ఆమె వద్ద గతంలో డబ్బు అప్పుగా తీసుకున్నాడని, ఈ క్రమంలోనే రైల్లో ఇలా దాడికి పాల్పడినట్లు తెలుసుకున్నారు.

ఈ దృశ్యాలను కొందరు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. కళ్లముందే ఇంతటి దారుణం జరుగుతున్నా అడ్డుకునే ప్రయత్నం చేయకుండా ప్రయాణికులు సినిమా చూసినట్లు చూడడంపై విమర్శలు వస్తున్నాయి. 

  • Loading...

More Telugu News