comedian mahesh: పెద్దవాళ్ల ప్రశంసలు దక్కాయి .. నా జన్మ ధన్యమైపోయింది: 'జబర్దస్త్' మహేశ్

  • ఫస్టు కాంప్లిమెంట్ చిరంజీవి గారు ఇచ్చారు 
  • పెద్ద పెద్ద వాళ్లంతా మెచ్చుకున్నారు 
  • నాకు చాలా ఆనందంగా వుంది  

'రంగస్థలం' సినిమాలో 'జబర్దస్త్' మహేశ్ ఒక మంచి పాత్రను పోషించాడు. ఆయన పోషించిన పాత్రకు మంచి గుర్తింపు లభించింది. ఈ విషయాన్ని గురించి ఆయన ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో ప్రస్తావించాడు. " ఈ సినిమాలో సీనియర్ ఆర్టిస్టులతో కలిసి నటించే అవకాశం కలిగింది. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక ఈ సినిమా చూసిన తరువాత 'చాలా బాగా చేశావయ్యా' అంటూ చిరంజీవి గారు ఫస్టు కాంప్లిమెంట్ ఇచ్చారు. తరువాత దేవిశ్రీ ప్రసాద్ గారు నన్ను మెచ్చుకున్నారు".

 "సుకుమార్ గారికి ప్రకాశ్ రాజ్ గారు .. జగపతిబాబు గారు .. రవిరాజా పినిశెట్టి గారు ఫోన్ చేసి, నా గురించి అడిగారట. నేను చాలా బాగా చేశానని చెప్పారట. పెద్ద పెద్ద వాళ్లు నన్ను మెచ్చుకుంటుంటే నా జన్మ ధన్యమైపోయిందని అనిపించింది. ఇక సందీప్ కిషన్ .. వెన్నెల కిషోర్ .. సప్తగిరి .. మా 'జబర్దస్త్' బ్యాచ్ అభినందించడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది" అని చెప్పుకొచ్చాడు.    

More Telugu News