kala venkat rao: రేపు ఉదయం అన్ని నియోజక వర్గాల్లో సైకిల్ యాత్ర: ఏపీ మంత్రి కళా వెంకట్రావు

  • రేపు ఉదయం 8 గంటల నుంచి సైకిల్ యాత్ర
  • ప్రారంభించనున్న చంద్రబాబు
  • ఎంపీలు ఏపీకి వచ్చాక బస్సు యాత్ర
  • బస్సు యాత్రకు ఆత్మగౌరవ యాత్రగా నామకరణం

ఆంధ్రప్రదేశ్‌కి కేంద్ర ప్రభుత్వం చేస్తోన్న అన్యాయానికి నిరసనగా రేపు ఉదయం 8 గంటల నుంచి తాము ఏపీలోని అన్ని లోక్‌సభ, అసెంబ్లీ నియోజక వర్గాల్లో సైకిల్ యాత్ర ప్రారంభిస్తామని ఏపీ మంత్రి కళా వెంకట్రావు తెలిపారు. ఈ రోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు చర్చించారు. అనంతరం కళా వెంకట్రావు మీడియాతో మాట్లాడుతూ... ఈ సైకిల్ యాత్రను చంద్రబాబు నాయుడు జెండా ఊపి ప్రారంభిస్తారని చెప్పారు.

ఈ యాత్రలో చంద్రబాబు విజయవాడలో పాల్గొననున్నట్లు తెలిపారు. అలాగే, ఎంపీలు ఢిల్లీ నుంచి తిరిగి వ‌చ్చాక బ‌స్సు యాత్ర  కూడా చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నట్లు చెప్పారు. ఏపీలోని అన్ని జిల్లాల్లో చేయనున్న ఈ బస్సు యాత్రకు ఎంపీలు ఆత్మగౌరవ యాత్రగా నామకరణం చేశారని కళా వెంకట్రావు ప్రకటించారు.

More Telugu News