mi: మీరు ఎంఐ అభిమానా...? అయితే క్రౌడ్ ఫండ్ ఆఫర్ అందుకోండి!

  • యూజర్ల ఆసక్తిని తెలుసుకునే కార్యక్రమం
  • ఆదరణ ఉందనుకుంటేనే ఉత్పత్తుల ఆవిష్కరణ
  • తొలుత సెల్ఫీ స్టిక్ ట్రైపాడ్, బ్లూటూత్ ఆడియో రిసీవర్ విక్రయాలు
  • ఈ నెల 5, 6 వ తేదేల్లోనే ఈ అవకాశం

ఎంఐ బ్రాండ్ ను అభిమానించే వారి కోసం ‘ఎంఐ క్రౌడ్ ఫండింగ్’ పేరుతో షియోమీ సంస్థ ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది. భారత మార్కెట్లో ఏ ఉత్పత్తిని విక్రయించాలన్నది ఇకపై ఇక్కడి యూజర్ల చేతిలోనే ఉంటుంది. తాను తీసుకురావాలనుకునే ఉత్పత్తులను తొలుత కొన్నింటిని తన వెబ్ సైట్లో ఉంచి, వాటిపై ఫీడ్ బ్యాక్ తీసుకుని, తగినంత మంది కస్టమర్లు ఆసక్తిగా ఉన్నారనుకుంటేనే ఆయా ఉత్పత్తులను భారత్ కు తీసుకొస్తుంది.

అదే క్రౌడ్ ఫండింగ్. ఒకవేళ నిర్ణీత సమయంలోపు ఆ ఉత్పత్తి అనుకున్న ప్రమాణాలను అందుకోలేకపోతే విక్రయాలను షియోమీ నిలిపివేస్తుంది. యూజర్లకు నగదును వెనక్కి కూడా ఇస్తుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారి కోసం మొదటగా రెండు ఉత్పత్తులను తన వెబ్ సైట్లో అందుబాటులో ఉంచింది. ఎంఐ సెల్ఫీ స్టిక్ ట్రైపాడ్, బ్లూటూత్ ఆడియో రిసీవర్ ను యూజర్లు కొనుగోలు చేసుకోవచ్చు. ఈ నెల 5, 6 వ తేదీల్లో ఈ అవకాశం ఉంటుంది.

More Telugu News