Mahesh Babu: 'వచ్చాడయ్యో సామి' .. మహేశ్ సాంగ్ రిలీజ్ రేపే!

  • 'భరత్ అనే నేను' నుంచి మూడవ పాట 
  • రేపు సాయంత్రం 5 గంటలకు రిలీజ్  
  • ఈ నెల 7వ తేదీన ఆడియో వేడుక    

'భరత్ అనే నేను' సినిమా విడుదల తేదీ ( ఏప్రిల్ 20) దగ్గర పడుతుండటంతో, మహేశ్ బాబు అభిమానులంతా ఎంతో ఆసక్తిగా .. ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఈలోగా అభిమానుల్లో ఎప్పటికప్పుడు ఉత్సాహాన్ని రేకెత్తించడం కోసం, ఈ సినిమా నుంచి ఒక్కో సాంగ్ ను వదులుతున్నారు. అలా ఇంతకుముందు వదిలిన రెండు సాంగ్స్ మంచి మార్కులు కొట్టేశాయి.

ఇక మూడవ సాంగ్ గా 'వచ్చాడయ్యో సామి' అనే సాంగ్ ను రేపు సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. మహేశ్ బాబు లుంగీ పైకి కట్టేసి .. తలకి పాగా చుట్టుకుని జనంతో కలిసి చిందులేస్తూ ఈ పోస్టర్లో కనిపిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో కైరా అద్వానీ కథానాయికగా నటించింది. ఈ నెల 7వ తేదీన జరగనున్న  ఆడియో ఫంక్షన్ కి ఎన్టీఆర్ .. చరణ్ రానున్నారనే టాక్ వినిపిస్తోంది.       

More Telugu News