rai laxmi: ఈ ఫొటో ప్రత్యేకమైన వ్యక్తి తీశారంటున్న రాయ్ లక్ష్మి!

  • మలయాళ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న రాయ్ లక్ష్మి 
  • మమ్ముట్టిని ఫొటో తీయమన్న ముద్దుగుమ్మ 
  • నెటిజన్లను ఆకట్టుకుంటున్న ఫొటో

ప్రముఖ సినీ నటి రాయ్‌ లక్ష్మి ట్విట్టర్ లో ఒక ప్రత్యేకమైన ఫొటోను అభిమానులతో పంచుకుంది. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే రాయ్ లక్ష్మి పంచుకున్న ఫొటో అభిమానులను అలరిస్తోంది. సృజనకి అద్దం పడుతున్న ఆ ఫొటోని తీసింది మలయాళ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి కావడం విశేషం. షూటింగ్ గ్యాప్ లో కెమెరా చేతబట్టిన ఆయన అద్భుతమైన ఫొటోను తీశారు.

తాను జలపాతం దగ్గర నిలబడి సూర్యుడ్ని మింగేస్తున్నట్టు దిగిన ఆ దృశ్యాన్ని తానే ముచ్చటపడి ఫొటో తీయించుకున్నానని, సినిమా చిత్రీకరణ ఇంత అందమైన లొకేషన్ లో జరుగుతోందని తెలిపింది. ఈ ఫొటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

More Telugu News