Maharashtra: చిరుతతో 15 నిమిషాలు పోరాడి తల్లిని కాపాడుకున్న ధీర వనిత

  • మహారాష్ట్రలోని ఉస్ గావ్ లో మేకలు పెంచుకుంటున్న జీజాబాయి
  • అర్ధరాత్రి మేకల కొట్టంలో అలజడితో మెళకువ
  • వాకిట్లోకి వెళ్లి చూడగా, మేకలు తింటూ కనిపించిన చిరుత

చిరుతపులితో 15 నిమిషాలు వీరోచితంగా పోరాడి తల్లిని కాపాడుకున్న యువతిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఆ ఘటన వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని సాకోలీ తాలుకా పరిధిలోని ఉస్‌ గావ్‌ లో మేకలు పెంచుకుని జీవనం సాగిస్తున్న జీజాబాయి, కుమార్తె రూపాలీ (21)తో కలిసి ఉంటోంది.  మార్చి 24వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో మేకలను కట్టేసిన ప్రాంగణం నుంచి అలజడి శబ్దం రావడంతో నిద్రలేచిన జీజాబాయి, కుమార్తెతో కలిసి బయటకు వచ్చింది. రక్తపుమడుగులో మేక పిల్లలు పడి ఉండగా, చిరుతపులి వాటిని తింటూ కంటబడింది.

తలుపు తెరిచిన చప్పుడుకు వారిని చూసిన చిరుత వారిపై దాడికి దిగింది. వెంటనే రూపాలి ఎదురుతిరిగింది. చేతిలో కర్రతో చిరుతతో కలబడింది. తల్లిని వెనక్కి తోసుకుంటూ చిరుతతో సుమారు 15 నిమిషాలు పోరాడింది. అనంతరం నెమ్మదిగా ఇంట్లోకి వెళ్లి తల్లీ కుమార్తెలు తలుపువేసుకుని, గడియ పెట్టుకున్నారు. దీంతో చిరుత వెనుదిరిగింది. ఈ పోరాటంలో తీవ్రంగా గాయపడిన రూపాలీని నాగ్‌ పూర్‌ లోని ప్రభుత్వ వైద్యవిద్యా కళాశాల ఆస్పత్రికి గ్రామస్థులు తరలించగా, వారం రోజులు చికిత్స తీసుకున్న రూపాలీ నిన్న డిశ్చార్జ్ అయింది.

More Telugu News