rangastalam: అమ్మానాన్నలతో కలసి 'రంగస్థలం' చూశా... అమ్మ ఏడ్చేసింది!: ఆది పినిశెట్టి

  • క్లైమాక్స్ కు ముందు చనిపోతానని ఎవరికీ చెప్పలేదు
  • ఆ సీన్ చూసి అందరూ ఏడ్చేశారు
  • 'అమ్మా! ఇది సినిమా' అంటూ ఓదార్చాను

'రంగస్థలం' సినిమాను తన తల్లిదండ్రులు, స్నేహితులతో కలిసి చూశానని ఈ సినిమాలో కుమార్ బాబు పాత్ర పోషించిన ఆది పినిశెట్టి తెలిపాడు. సినిమాలో క్లైమాక్స్ కు ముందు తాను చనిపోతానని ఎవరికీ చెప్పలేదని అన్నాడు. దీంతో తాను చనిపోయే సీన్ చూసి అందరూ ఏడ్చేశారని అన్నాడు. అమ్మ ఏడుస్తుంటే పక్కనే ఉన్న తాను 'ఇది సినిమా అమ్మా' అంటూ ఓదార్చానని తెలిపాడు.

ఈ సినిమాలో ప్రతిఒక్కరూ అంతలా లీనమైపోతారని చెప్పాడు. సాధారణంగా తాను ఒక సినిమా ఒప్పుకునే ముందు, కథ విని రెండు రోజులు ఆలోచించిన తరువాత నిర్ణయం చెబుతానని ఆది చెప్పాడు. కానీ సుకుమార్ రెండు గంటలు కథ చెప్పిన వెంటనే చేస్తానని అంగీకరించానని అన్నాడు. కథ అంత బాగా నచ్చిందని, సినిమాను సుకుమార్ ఎంతో హృద్యంగా తెరకెక్కించాడని అభినందించాడు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అందులో లీనమైపోతున్నారని పేర్కొన్నాడు.

More Telugu News