Telugudesam: తాతకు తగ్గ మనవడు, తండ్రికి తగ్గ తనయుడు లోకేశ్ కు అభినందనలు : కంభంపాటి రామ్మోహన్

  • ఏపీ ఐటీ శాఖా మంత్రిగా నారా లోకేశ్ ఏడాది పూర్తి చేసుకున్నారు
  • లోకేశ్ పని తీరు అద్భుతంగా ఉంది
  • జగన్ మాత్రం నాటకాలరాయుడిగా పేరు తెచ్చుకున్నారు
  • జగన్ కు దమ్ముంటే ప్రధాని మోదీ ఇంటి ముందు దీక్ష చేయాలి

ఏపీ ఐటీ శాఖా మంత్రిగా ఏడాది కాలం పూర్తి చేసుకున్న నారా లోకేశ్ కు అభినందనలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా పలువురు మంత్రులు, టీడీపీ నేతలు ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ నేత కంభంపాటి రామ్మోహన్ మాట్లాడుతూ, తాతకు తగ్గ మనవడిగా, తండ్రికి తగ్గ తనయుడుగా లోకేశ్ నిరూపించుకున్నారని అన్నారు. లోకేశ్ పని తీరు అద్భుతంగా ఉందని ఆయన కితాబిచ్చారు.

ఈ సందర్భంగా వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు. జగన్ పాదయాత్ర, కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టడం, ఎంపీలతో రాజీనామా చేయిస్తాననడం, ఆ తర్వాత ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించడం అంతా నాటకాలేనని, ఓ నాటకాలరాయుడిగా ఆయన మారారని మండిపడ్డారు. ఢిల్లీలో చేయాల్సిన ఉద్యమాలు గల్లీలో చేస్తున్నారని, జగన్ కు దమ్ముంటే ప్రధాని మోదీ ఇంటి ముందు దీక్ష చేయాలని డిమాండ్ చేశారు.  

  • Loading...

More Telugu News