justce chalameswar: తొడలు కొట్టి మీసాలు మెలేస్తున్న నాయకుల మధ్య ఆయన ఇమడలేరు!: జస్టిస్ చలమేశ్వర్

  • యలమంచిలి శివాజీ వ్యాసాల సంకలనం ‘తలచుకుందాం ప్రేమతో’
  • విజయవాడలో ఆవిష్కరించిన సుప్రీం కోర్టు న్యాయమూర్తి
  • నాడు రాజకీయాల కోసం జైలుకు వెళ్లిన నేతలు ఉన్నారు
  • నేడు రాజకీయ పదవులు అనుభవించాక జైలుకు వెళుతున్నారు

తొడలు కొట్టి మీసాలు మెలేస్తున్న నాయకుల మధ్య యలమంచిలి శివాజీ ఇమడలేరని, అందుకే, రాజకీయాలకు ఆయన దూరంగా ఉన్నారని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు. యలమంచిలి  శివాజీ రాసిన ‘తలచుకుందాం ప్రేమతో’ పుసక్తాన్ని విజయవాడలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చలమేశ్వర్ మాట్లాడుతూ, నాడు రాజకీయాల కోసం జైలుకు వెళ్లిన నేతలు ఉన్నారని, ఇప్పుడు మాత్రం రాజకీయల్లోకి వచ్చి పదవులు అనుభవించాక జైలుకు వెళుతున్నారని అన్నారు.

మరో రెండు నెలల పాటు రాజకీయాల గురించి తాను మాట్లాడనని త్వరలో రిటైర్మెంట్ కానున్న చలమేశ్వర్ పేర్కొనడం గమనార్హం. కాగా, తనకు పరిచయం కలిగిన వ్యక్తుల గురించి, తనకు నచ్చిన వారి గురించి పలు సందర్భాల్లో యలమంచిలి శివాజీ రాసిన వ్యాసాలను ‘తలచుకుందాం ప్రేమతో’ లో పొందుపరిచారు. ‘పదహారణాల గాంధేయవాది మంతెన’, ‘రాజర్షి రాజన్న’, లోకనాయక్ జయప్రకాశ్ నారాయణ్’ వంటి వ్యాసాలు ఇందులో పొందుపరిచారు.

More Telugu News