Jammu And Kashmir: తెల్లవారుజాము నుంచి వరుస ఎన్ కౌంటర్లు... 8 మంది పాక్ ముష్కరుల హతం

  • సరిహద్దుల్లో ఎన్ కౌంటర్లు
  • సోఫియాన్, అనంతనాగ్ జిల్లాల్లో ఘటనలు
  • కొనసాగుతున్న ఎదురుకాల్పులు

జమ్మూ కాశ్మీర్ లోని సరిహద్దు ప్రాంతాల్లో ఈ తెల్లవారుజాము నుంచి వరుస ఎన్ కౌంటర్లు జరుగుతున్నాయి. సోఫియాన్, అనంతనాగ్ జిల్లాల్లో ఈ ఎన్ కౌంటర్లు జరుగగా, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, సైన్యం ఎదురు కాల్పుల్లో 8 మంది ఉగ్రవాదులు హతులయ్యారు. సోఫియాన్ జిల్లాలోని రెండు ప్రాంతాల్లో ఇంకా ఎన్ కౌంటర్ కొనసాగుతోంది.

కచ్చాదోరా, ద్రాగాడ్ గ్రామాల్లోకి ఉగ్రవాదులు సాయుధులై చొరబడ్డారన్న సమాచారం అందడంతో, ఈ ప్రాంతాన్ని భారీఎత్తున బలగాలు చుట్టుముట్టాయి. ఉగ్రవాదులు ఎదురు కాల్పులు జరపడంతో మొత్తం ఏడుగురు మరణించారు. అనంతనాగ్ జిల్లాలోని దైల్ గావ్ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఒక ఉగ్రవాది హతం కాగా, మరొకడు ప్రాణాలతో పట్టుబడ్డట్టు సైన్యాధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News